YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

క్షతగాత్రులను ఆదుకుంటాం

క్షతగాత్రులను ఆదుకుంటాం

క్షతగాత్రులను ఆదుకుంటాం
కాకినాడ
కాకినాడ వెంకట చలపతి నర్సింగ్ హోంలో చికిత్సపొందుతోన్న 9 మంది  బాణాసంచా పేలుడు క్షతగాత్రులను  మంత్రి కురసాల కన్నబాబు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ నయీం అస్మీ పరామర్శించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరం, ఎలా జరిగిందనేదానిపై విచారణ జరుగుతోంది. 9 మంది గాయపడ్డారు, 5 గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బాధితులను ఆదుకుంటామని అన్నారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా ఫైర్ వర్క్స్ కు అనుమతులు ఉన్నాయి, ఘటన ఎలా జరిగిందనే దానిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని అన్నారు.

Related Posts