Highlights
- నిరసన దీక్షకు దిగిన సస్పెండైన ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను అప్రజాస్వామికంగా తొలగించటాన్ని నిరశిస్తూ..బుధవారం ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ కార్యనిర్వాహాక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ శాసనపక్ష నేత కే.జానా రెడ్డి, మందలిపక్ష నేత షబ్బీర్ అలీ లతో పాటుగా ఇతర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరు ఈ నిరాహార దీక్షలో పాల్గొనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా అయన పార్టీ శ్రేణులను కోరారు. కాగా ఇప్పటికే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి.వెంకటరెడ్డి, సంపత్ కుమార్లు నిరసన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.