YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నిండా మునుగుతున్న మొక్క జొన్న రైతులు

నిండా మునుగుతున్న మొక్క జొన్న రైతులు

నిండా మునుగుతున్న మొక్క జొన్న రైతులు
రంగారెడ్డి, 
ప్రౌవేటు కంపెనీల సీడ్ పండుతుందో లేదో అనే అనుమానంతో ప్రభుత్వం ఇచ్చిన పజ్జొన్న సీడ్‌‌ తీసుకున్నరు. ఎకరాకు 20 వేల దాక ఖర్చుపెట్టుకున్నరు… కష్టం చేశారు. పచ్చగ పెరుగుతున్న చేను చూసి ఈసారి మన పంట పండిందనుకున్నరు. మూడు నెలలు దాటినా ఒక్క మొక్క కూడా కంకి వేయకపోడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. నిండా మునిగిన తమకు నష్టపరిహారం ఇప్పించాలని అగ్రికల్చర్‌‌ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి వర్షాలు ఆలస్యంగా పడడంతో ఆరుతడి పంటలు సాగు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖ రైతలకు సూచించింది. తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పోరేషన్ ద్వారా ఆరుతడి పంటలకు సంబంధించి పలురకాలు సీడ్స్‌‌ సబ్సిడీపై సరఫరా చేశారు. ఇందులో భాగంగా ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ఆఫ్ మిల్లెట్స్ రీసర్చ్(ఐఐఎమ్మార్‌‌) డెవలప్‌‌ చేసిన ఎన్‌‌-–15 పజ్జొన్న సీడ్‌‌ అందించారు. 90 శాతం సబ్సిడీతో రూ.47కు మూడు కిలోల సీడ్‌‌ బ్యాగ్ ఇవ్వడంతోపాటు ఐఐఎమ్మార్‌‌ డెవలప్‌‌ చేసిందని… మేలురకమైనవని ప్రచారం చేయడంతో ఎక్కువమంది రైతులు సీడ్‌‌ తీసుకున్నారు. దొరకని వారు ప్రైవేటుగా పూర్తి ధర చెల్లించి మరీ కొన్నారు. పాత రంగారెడ్డి, చుట్టుపక్కల జిల్లాలో వేల ఎకరాల్లో సాగు చేశారు.మిగతా రకాలకంటే కూడా ఎన్‌‌-15 రకం చేను ఏపుగా పెరగడంతో రైతులు సంతోషించారు. ఎకరాకు రూ.20 వేల వరకు ఖర్చు చేస్తారు. 65 రోజులు గడిచినా కంకిపెట్టకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. 90 రోజులు దాటినా ఒక్క మొక్క కూడా కంకి వేయడం లేదు. దీంతో రైతులు నష్టపోయామని గ్రహించారు. ఈ విషయాన్ని ఆఫీసర్లకు విన్నవించారు. వారు ఐఐఎమ్మార్‌‌ శాస్త్రవేత్తలకు తెలుపగా వారు వచ్చి పంటలు పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన సీడ్‌‌ వల్లే నష్టం జరగడంతో రైతులకు ఏం చేయాలతో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. అలాగే విత్తనం విక్రయించినప్పుడు వాటికి సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వలేదని రైతులు అంటున్నారు. తమను ఆదుకోవాలని అగ్రికల్చర్‌‌ ఆఫీస్‌‌ల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలోనే అధికంగా రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో 2.19 క్వింటాళ్ల పజ్జొన్న విత్తనాలు పంపిణీ చేశారు.

Related Posts