YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్ధిని ఆత్మహత్య
చిత్తూరు  అక్టోబరు  1  
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల మేరకు  చిత్తూరు జిల్లా సత్యవేడు బలిజవీధికి చెందిన 

చెంచురామయ్య, కవిత దంపతుల కుమార్తె స్వప్న (16) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలో స్వప్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిఈసి 

చదువుతుంది. తమ కుమార్తె కనిపించడం లేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంగళవారం  ఉదయం బావిలో విద్యార్థిని మృతదేహం కనిపించింది. ఘటనా స్థలానికి పోలీసులు 

చేరుకున్నారు. కుటుంబంలో గొడవల కారణంగా మనస్థాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో 

దర్యాప్తు చేస్తున్నామని సిఐ శ్రీనివాసులు తెలిపారు. 

Related Posts