YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

మలేసియా నుండి కోమా పేషేంటును ఇప్పుడే పంపలేం

మలేసియా నుండి కోమా పేషేంటును ఇప్పుడే పంపలేం

మలేసియా నుండి కోమా పేషేంటును ఇప్పుడే పంపలేం 
 ఆరోగ్యం మెరుగుపడేదాకా వేచి చూడాల్సిందే
 స్పందించిన రాయబార కార్యాలయం
జగిత్యాల  అక్టోబర్ 01  
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన తట్ర రాజం అనే యువకునికి మలేసియాలో పనిప్రదేశంలో తలకు దెబ్బ తగిలి అపస్మారక స్థితి  లో ఆసుపత్రిలో 

చికిత్స పొందుతున్నాడు.  అతనికి మెరుగైన వైద్యం అందించి స్వదేశానికి పంపించాలని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్ది మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని 

ఇండియన్ హైకమీషన్ కు ఇ-మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మలేషియాలోని భారత దౌత్యాధికారులు లక్ష్మీకాంత్ కుంబర్, నిషిత్ కుమార్ ఉజ్వల్ లు 

స్పందించి మంగళవారం భీంరెడ్డికి జవాబు ఇచ్చారు. కోమాలో ఉన్న పేషేంటు ప్రస్తుత స్థితి ప్రయాణానికి అనువుగాలేదని ఆసుపత్రివారు తెలిపారని, ఇదే విషయాన్ని స్థానికి తెలుగు 

సంఘం ద్వారా ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులకు తెలియపర్చామని దౌత్యాధికారులు వివరించారు.

Related Posts