YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

భర్తను ప్రియుడితో కలిసి హత్య

భర్తను ప్రియుడితో కలిసి హత్య

 భర్తను ప్రియుడితో కలిసి హత్య
వరంగల్, అక్టోబరు 3  
మహబూబాబాద్ జిల్లాలో గత నెల 12వ తేదీన జరిగిన పెయింటర్ ఇన్నారపు నవీన్ హత్యకేసును పోలీసులు చేధించారు. నవీన్ భార్య పక్కింటి యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని, ప్రియుడి సాయంతోనే భర్తను హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు వారిద్దరితో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు.మహబూబాబాద్‌ పట్టణంలోని మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్‌ పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నవీన్ పని నిమిత్తం ఎక్కువ సమయం ఇంట్లో ఉండకపోవడంతో అతడి భార్య శాంతి.. వెంకటేశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండేళ్లుగా గుట్టుగా సాగుతున్న వీరి బంధం గురించి నవీన్‌ను ఇటీవలే తెలియడంతో భార్యను హెచ్చరించాడు. దీనిపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న నవీన్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు.పథకం ప్రకారం శాంతి సెప్టెంబర్ 12న భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. మటన్ తీసుకురావాలని నవీన్‌కు చెప్పడంతో స్కూటీపై రేగడితండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో వెంకటేశ్, అతడి స్నేహితుడు కాపుకాసి నవీన్‌ను అడ్డగించారు. అతడి తలపై ఇనుప రాడ్‌తో బలంగా మోది చంపేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కూటీని నవీన్‌పై పడేసి వెళ్లిపోయారు. భర్త చనిపోయిన విషయం తెలియగానే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు శాంతి శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే శాంతి అక్రమ సంబంధం గురించి తెలిసిన నవీన్ సోదరుడు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం, కురవి ఎస్ఐ శంకర్రావు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేశారు. సంఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలతో పాటు అక్కడ దొరికిన మద్యం సీసాలపై బార్‌కోడ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. శాంతి, వెంకటేశ్ కాల్స్‌డేటాను పరిశీలించి వారు మాట్లాడుకున్న సంభాషణలను విశ్లేషించారు. దీంతో వారిద్దరే నవీన్‌ను హత్య చేశారని నిర్ధారించి అరెస్ట్ చేశారు.

Related Posts