YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

అగ్నిప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు

అగ్నిప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు

అగ్నిప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
చిత్తూరు  అక్టోబరు 3,
చిత్తూరు పట్టణం లో అగ్నిప్రమాదం జరిగింది. ,ఉదయం కాపీ త్రాగుదామని భావించిన ఆ కుటుంబం అగ్నికీలల్లో చిక్కుకుని ఆస్పత్రి పాలైంది. మిట్టూరు లోని ఒక  ఇంట్లో వంటగ్యాస్ లీక్ కావడంతో ఈ ఘటన జరిగింది.  ఆరు మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ,గాయపడిన వారిని తొలుత చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరువాత  మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.   శాంతి(55), సుకన్య(40), ఉమాదేవి (30), పూర్ణిమ (32), మధు (7),  అనుదీపిక (8) మంటల్లో చిక్కుకుని గాయపడ్డారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. వన్ టౌన్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు తహశీల్దార్ సుబ్రహ్మణ్యం ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు

Related Posts