YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హూజురు నగర్ బరిలో 28 మంది 

హూజురు నగర్ బరిలో 28 మంది 

హూజురు నగర్ బరిలో 28 మంది 
నల్గొండ, అక్టోబరు 3,
హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో 28 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 76 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 45 నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మరో ముగ్గురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గురువారం ఉపసంహరణకు చివరి రోజు. కంచుకోట లాంటి చోట కమ్యూనిస్టులు ఉనికిలో లేకుండా పోయారు. ఉప ఎన్నికల్లో సీపీఐ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో బై పోల్ లో కామ్రేడ్లు పోటీకి దూరమయ్యారు. ఇది జిల్లాలో రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.బై ఎలక్షన్ లో టీడీపీ.. సీపీఎం మద్దతు కోరింది. తమకు మద్దతు ఇవ్వాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఫోన్ లో మాట్లాడారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాగా సీపీఎం అభ్యర్థినామినేషన్ తిరస్కరణపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. మరోవైపు ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని టీజేఎస్ నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ కు బయటి నుంచి మద్దతిస్తామని, వారితో కలిసి ప్రచారం చేయబోమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రక తప్పిదమని విమర్శించారు.(అక్టోబర్ 21, 2019)వ తేదీన హుజూర్ నగర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. (అక్టోబర్ 24, 2019)వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికివారే గెలుస్తామనే ధీమాలో ఉన్నారు. ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Related Posts