YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

చానెల్  డిబేట్ లో వైసీపీ నేతల బూతులు

చానెల్  డిబేట్ లో వైసీపీ నేతల బూతులు

చానెల్  డిబేట్ లో వైసీపీ నేతల బూతులు
హైద్రాబాద్, అక్టోబరు 3, (న్యూస్ పల్స్)
 న్యూస్ ఛానల్ పబ్లిక్ డిబేట్‌లో వైఎస్సార్‌సీపీ నేత రెచ్చిపోయారు. పరుష పదజాలంతో నోరు పారేసుకున్నారు.. టీడీపీ నేతను దుర్భాషలాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వైఎస్సార్‌సీపీ నేత తీరుపై టీడీపీతో పాటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ఈ వీడియోను మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ప్రజలు చూస్తున్నారన్న స్పృహ లేకుండా ఎలా మాటలు తూలుతున్నారో చూడండి అంటూ ఈ వీడియోను ట్వీట్ చేశారు.‘చేతకాని వాళ్ళకు నోరు ఎక్కువ అంటారు. జగన్ గారూ.. మీరు చేస్తోన్న తుగ్లక్ పనులను ఎలా సమర్థించుకోవాలో తెలీక, మీ పార్టీ అధికార ప్రతినిధులు ఎలా అసహనానికి గురవుతున్నారో చూడండి. ప్రజలు చూస్తున్నారన్న స్పృహ లేకుండా ఎలా మాటలు తూలుతున్నారో చూసి గర్వపడతారో, సిగ్గుపడతారో మీ ఇష్టం’అంటూ లోకేష్ ట్వీటారు.గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభం కావడంతో.. దీనిపై ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ చర్చ నిర్వహించింది. ఈ చర్చకు టీడీపీ నుంచి టీఎన్‌ఎస్‌ఎఫ్ నేత బ్రహ్మం, వైఎస్సార్‌సీ తరుపున రవిచంద్రారెడ్డి వెళ్లారు. చర్చ మధ్యలో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. వెంటనే రెచ్చిపోయిన వైఎస్సార్‌సీపీ నేత నోర్మూయ్ వెదవ, చెప్పుతో కొడతా రా అంటూ పరుష పదజాలంతో ఎగిరెగిరి పడ్డారు.

Related Posts