YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దేవరగట్టు ఉత్సవాలకు ఏర్పాట్లు

దేవరగట్టు ఉత్సవాలకు ఏర్పాట్లు

దేవరగట్టు ఉత్సవాలకు ఏర్పాట్లు

కర్నూలు,  అక్టోబర్ 03 (న్యూస్ పల్స్)
:    మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో  కర్రల సమరాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని  జిల్లా కలెక్టర్ జివీరపాండియన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో బన్నీ ఉత్సవాలపై సమావేశం నిర్వహించారుజిల్లా ఎస్పీ పకీరప్పజాయింట్ కలెక్టర్ రవి పట్టన్ శెట్టిఆదోని ఆర్డీవో బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా జిల్లాకలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ  నెల 5 నుండి 9 వరకు దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో దాదాపు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని  మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారుదేవరగట్టు ఆలయ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టడంతో పాటు పార్కింగ్ ప్రదేశాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీఅధికారులను ఆదేశించారుత్రాగునీటికి ఇబ్బంది లేకుండా పది ప్రదేశాలను గుర్తించి కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారుమొబైల్ టాయిలెట్ తో పాటు తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటుచేయాలని ఆదేశించారువిద్యుత్ కొరత లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు 125 కెవి జనరేటర్ ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి అన్నారుపార్కింగ్ ప్రదేశంలో డీఎస్పీ సూచించిన ప్రదేశంలోఅదనపు ట్రాన్స్ఫార్మర్ బిగించి ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారుపోలీస్ అధికారులు సూచించిన ప్రదేశాలలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు రహదారుల్లో ఉన్న గుంతలను పూడ్చి రహదారులను సరిచేయాలని ఆర్అండ్ బిపంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారుకర్రల సమరంలో గాయపడిన భక్తులకు వెంటనే వైద్య చికిత్సలు అందించేందుకు 20 పడకల ఆసుపత్రినాలుగు వైద్య బృందాలునాలుగు అంబులెన్సులు సిద్ధంగాఉంచుకోవడంతో పాటు అవసరమైన డాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని అడిషనల్ డిఎంహెచ్ఓ ను ఆదేశించారుదేవరగట్టు ఆలయ పది కిలోమీటర్ల పరిధిలో  మద్యం షాపులు మూసివేయడంతో పాటు అక్రమ నాటుసారా స్థావరాలనుగుర్తించి దాడులు నిర్వహించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు
           జిల్లా ఎస్పి పకీరప్ప మాట్లాడుతూ కర్రల సమరంలో పాల్గొనే ప్రధాన వ్యక్తులను గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారుఆలూరు హాలహర్వి ఆస్పరి చిప్పగిరి చుట్టుపక్కల గ్రామాలలో కర్రల సమర అనాగరికచర్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.144 సెక్షన్ అమలు చేయడంతో పాటు శిధిలావస్థకు చేరుకున్న  భవనాలపై భక్తులు ఎక్కకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారుఅక్రమమద్యాన్ని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్,  చెక్పోస్టులు పటిష్టం చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారుదేవరగట్టు ఆలయ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీక్షిస్తామని కలెక్టర్ కు నివేదించారుకార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్  జయరామిరెడ్డివిధ్యుత్ ఎస్  భార్గవరాముడుఆర్డబ్ల్యూఎస్ ఎస్ పంచాయతీ రాజ్ ఇంజనీర్లుఅగ్నిమాపక సిబ్బందిపోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Posts