YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఓటర్ల జాబితాలో పేర్లును పరిశీలనలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలి

ఓటర్ల జాబితాలో పేర్లును పరిశీలనలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలి

ఓటర్ల జాబితాలో పేర్లును పరిశీలనలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలి
ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్
హైదరాబాద్ అక్టోబర్ 03 
 ఓటర్లజాబితా కనుగుణంగా ఓటర్ల పరిశీలన అందరికీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం నాడు హైదరాబాదు నుండి ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఓటర్ల జాబితాలో తమ పేర్లను పరిశీలించు కోవడానికి అన్ని  వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. 
 డ్వాక్రా సంఘాలు, కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వామ్యంతో ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల యొక్క వివరాలను జాబితాలో పరిశీలించు కోవాలని అన్నారు. ఓటర్ల జాబితా పరిశీలనలో రాష్ట్రంలో జగిత్యాల జిల్లా రెండవ స్థానంలో ఉన్నదని అన్నారు. అదేవిధంగా బిఎల్ వో లు వారి పరిధిలోని గ్రామ పంచాయతీలలో కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఓటర్ లిస్టులో గ్రామ ప్రజల యొక్క ఓటర్ వెరిఫికేషన్ చేపించుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Related Posts