YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవకతవకలు చేస్తుంది - రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవకతవకలు చేస్తుంది - రేవంత్ రెడ్డి

ప్రధానంగా రాష్ట్రం లో విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం అవకతవకలు చేస్తుంది.ప్రస్తుతం రాష్ట్రంలో లోటు విద్యుత్ నుండి మిగిలి విద్యుత్ వైపు ప్రయనిస్తున్నాం.అప్పటి upa ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇది సాధ్యం అయింది.మధ్యకాళిక విద్యుత్ ఒప్పందాలలో అత్యంత అవినీతి చోటుచేసుకుంది.అన్ని సంస్థలకు రిటైర్ అయిపోయిన వ్యక్తులను,కేసీఆర్ బంధువులను నియమిస్తున్నారు.

తక్కువ ధరకు విద్యుత్ కొనే అవకాశం ఉన్నా,బయట ఎక్కువ ధరకు విద్యుత్ ఈ ప్రభుత్వం కొంటుంది.దీని వల్ల ప్రభుత్వం,ప్రజలపై అత్యధిక భారం పడుతుంది.ఒక్కో యూనిట్ కి 1.95 పైసలు చొప్పున ఆ 4,910 mou లకు  ఈ ప్రభుత్వం 957.45 కోట్లు  స్థిర చార్జీలు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు చెల్లించిందివిద్యుత్ కొనకపోయినా ప్రభుత్వం ఈ 957.45 కోట్లు చెల్లించింది.ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థల విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది.ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇచ్చే కమీషన్ల కోసం ప్రభుత్వ విద్యుత్ సంస్థల్ని నిర్వీర్యం చేస్తుంది ఈ ప్రభుత్వం.ఈ రోజు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం తక్కువ ధరలకు విద్యుత్ ఇస్తామంటే ఎందుకు ఎక్కువదరకు ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల దగ్గర కొంటుంది.

దీని వెనకాల ఎలాంటి ప్రైవేట్ ఒప్పందాలు ఉన్నాయి బయట పెట్టాలి.24 గంటల విద్యుత్ పేరిట రాష్ట్రం లో భారీ కుట్రకు తెరలేపింది ఈ టి ఆర్ స్ ప్రభుత్వం.ప్రైవేట్ విద్యుత్ కంపెనీలకు లాభం చేకూర్చే విదంగా,వీరికి కమిషన్ అందేలా ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.విద్యుత్ కొనుగోలు కు సంబందించిన అన్ని ఫైల్స్, ని పేపర్స్ ని బయట పెట్టాలి.విద్యుత్ కొనుగోలు చేయకుండా 957.45 కోట్లు చెల్లిచిన ఈ ప్రభుత్వం దినికి ఎవరు బాద్యులో చెప్పాలి.ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతుంది.

జగదీశ్వర్ రెడ్డి ఒక చెంచా,

కేసీఆర్ ఒక మశ్చర్ పైల్వాన్.

Related Posts