YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అన్ని నియోజకవర్గాల్లో గాంధీ సంకల్ప యాత్రలు

అన్ని నియోజకవర్గాల్లో గాంధీ సంకల్ప యాత్రలు

అన్ని నియోజకవర్గాల్లో గాంధీ సంకల్ప యాత్రలు
అమరావతి 
ఈ నెల 13న కేంద్ర జలవనరుల మంత్రిని కలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  బాపూజీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్టు అయన వెల్లడించారు.  అన్ని నియోజకవర్గాల్లో భాజపా పార్లమెంట్ సభ్యులు ఈ యాత్రలో పాల్గొంటారన్నారు. గురువారం ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో 
మీడియాతో మాట్లాడారు.  బాపూజీ సిద్ధాంతాలు పాటించడం, ఆయన ఆశయాలు సాధించడం కోసమే ఈ యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును రేపు సందర్శిస్తామనీ.. ప్రస్తుతం ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో పరిశీలిస్తామన్నారు.  పోలవరం భవిష్యత్తు గురించి అదికారులతో చర్చిస్తామని కన్నా తెలిపారు. ఈ నెల 13న దిల్లీలో కేంద్ర జలవనరుల శాఖమంత్రిని కలుస్తామని చెప్పారు. పోలవరం కచ్చితంగా పూర్తిచేయాలనేదే తమ పార్టీ సంకల్పమని కన్నా స్పష్టంచేశారు.

Related Posts