YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

బౌద్ధమతంతో మహాబలిపురానికి సంబంధం... అందుకే అక్కడ బేటీ:

బౌద్ధమతంతో మహాబలిపురానికి సంబంధం... అందుకే అక్కడ బేటీ:

బౌద్ధమతంతో మహాబలిపురానికి సంబంధం... అందుకే అక్కడ బేటీ:
చెన్నై, 
రెండ్రోజుల భారత పర్యటన కోసం చైనా అధినేత జిన్‌పింగ్ చెన్నై చేరుకున్నారు. భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురంలో సమావేశం అవుతున్నారు. వీరిద్దరూ అనధికారికంగా సమావేశం అవుతున్న తరుణంలో.. ఇద్దరు నేతల మధ్య భేటీకి మహాబలిపురాన్నే కేంద్రం ఎందుకు ఎంచుకుందో తెలుసుకోవడం కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పురావస్తు ఆధారాలను పరిశీలిస్తే.. ప్రాచీన కాలం నాటి నుంచే చైనాతో మామల్లపురం సంబంధాలు ఉన్నాయి.2000 ఏళ్ల క్రితం నుంచే మామల్లపురం, చైనా మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే కాలానికి చెందిన చైనా నాణేలు తమిళనాడులో లభ్యమయ్యాయి. చైనాలోనూ తమిళ శాసనాలు దొరికాయి. కాంచీపురాన్ని చైనాలో “హువాంగ్-చే”గా పిలుస్తారు.అంతే కాదు 2000 సంవత్సరాల క్రితం సంగం యుగంలో మామల్లపురం ఓడరేవు పట్టణంగా విలసిల్లింది. చైనాతో సహా పలు దేశాలతో ఈ ప్రాంతానికి వాణిజ్య సంబంధాలు ఉండేవి.రేవుపట్టణమైన మామల్లపురం ద్వారా పల్లవులు.. చైనాతో సంబంధాలను నెరిపారు. చైనాకు తమ రాయబారులను కూడా పంపారు. చైనా సన్యాసి హుయాన్ త్సాంగ్ క్రీ.శ. ఏడో శతాబ్దంలో రేవు పట్టణమైన మామల్లాపురాన్ని సందర్శించాడు. బౌద్ధమతం గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి, ఆ మతం గ్రంథాలను పొందడానికి.. అప్పటికీ బౌద్ధ కేంద్రంగా విలసిల్లుతోన్న కాంచీపురాన్ని హుయాన్ త్సాంగ్ సందర్శించారు.హుయాన్ త్సాంగ్ అక్కడికి రావడానికి మరో కారణం కూడా ఉంది. పల్లవ రాజుల వంశానికి చెందిన ఓ యువరాజు.. బౌద్ధ మతాన్ని స్వీకరించి బోధి ధర్ముడిగా మారారు. బోధిధర్మ చైనాలో అనేక సంవత్సరాలు ఉండి ప్రజలకు బౌద్ధమతం గురించి బోధించారు. భౌద్ద ధర్మాన్ని పాటించే తన అనుయాయులకు స్వీయ రక్షణార్థం ఆయన మార్షల్ ఆర్ట్స్ బోధించారు. ఆయన బోధనలు అనంతరం జెన్ బౌద్ధంగా పేరొందాయి. అందుకే ప్రాచీన చైనాలో కాంచీపురం పేరు చాలా మందికి సుపరిచితం.బౌద్ధ మతం పరంగా చైనాతో మహాబలిపురం సంబంధం కలిగి ఉండటంతో.. మోదీ-జిన్‌పింగ్ భేటీకి ఈ ప్రాచీన పట్టణాన్ని ఎంపిక చేశారు. తమిళనాడులో ఎదగడం కోసం భావిస్తోన్న బీజేపీ వ్యూహాత్మకంగానే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసిందన వాదన కూడా ఉంది. కానీ మహాబలిపురం ప్రాంతాన్ని భేటీ కోసం ఎంపిక చేయాలని చైనానే కోరిందట.

Related Posts