YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

బీచ్ లో ప్రధాని మోడీ స్వచ్ఛా భారత్

బీచ్ లో ప్రధాని మోడీ స్వచ్ఛా భారత్

బీచ్ లో ప్రధాని మోడీ స్వచ్ఛా భారత్
చెన్నై 
తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. శనివారం ఉదయం స్థానిక మహబలిపురం బీచ్ కు వెళ్లారు. మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా.. అక్కడి పరిసరాల్లో చెత్త కనిపించడంతో ఆయనే స్వయంగా అక్కడున్న ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, తాగి పారేసిన కూల్ డ్రింక్ బాటిల్స్, ఐస్ క్రీమ్ కప్పులను ఏరడం ప్రారంభించారు  దాదాపు అరగంట పాటు చెత్తను తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం.. మనమంతా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేలా చూసుకుందాం అని ట్వీట్ చేశారు. ఇక ఈ దృశ్యాలను చూసిన లక్షలాది మంది ఆయన భారతావనికి రోల్ మోడలని కొనియాడారు.

Related Posts