YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పోస్టింగ్ తో సంబంధం లేదు

పోస్టింగ్ తో సంబంధం లేదు

పోస్టింగ్ తో సంబంధం లేదు
తిరుపతి, 
ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి భేటీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఓ ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్ట్‌ మెగా అభిమానులకు విపరీతమైన కోపం తెప్పించింది. వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వివాదం ముదురుతుండడంతో ఈ వివాదంపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యల పోస్టులకు, తనకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఫ్యాన్స్‌గా చెప్పుకుంటున్న కొందరు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.తనకు అభిమాన సంఘాలు లేవని, తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు. తనకి అసలు ట్విటర్, ఫేస్‌బుక్‌ అకౌంట్లే లేవని చెవిరెడ్డి తెలిపారు. చిరంజీవితో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. తాను తుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారని, అప్పటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయన్నారు.సోషల్ మీడియాలో పోస్టింగ్‌ల వెనుక కుట్రకోణం దాగుందన్నారు. సీఎం జగన్‌, చిరంజీవికి మధ్య సత్సంబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో టీడీపీనే ఈ ప్రచారానికి పూనుకుందని ఆరోపించారు. చిరంజీవిపై పెట్టిన పోస్టింగ్ లను ఖండిస్తున్నానన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టింగ్స్ ను తక్షణమే తొలగించాలని పోలీసులను కోరినట్టు ఆయన తెలిపారు.ఇంతకీ ఆ పోస్ట్‌లో ఏముందంటే.. ‘ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. చిరంజీవి కేంద్రమంత్రి గా ఉన్నప్పుడు జగన్ అరెస్టయ్యాడు. చట్టం ఇప్పుడు తన పని తాను చేసింది అని రామ్‌చరణ్ కామెంట్ చేశాడు సంతోషం పట్టలేక. వైఎస్ కుటుంబం అంటే మెగా కుటుంబానికి అంత కసి. అలాంటి తండ్రీకొడుకులు అదే జగన్ దర్శనం కోసం పడిగాపులు పడి అనుమతి సంపాదించారు. తమ సినిమాను ప్రత్యేకంగా చూడాల్సిందిగా ప్రార్ధించబోతున్నారు. అదే కాల మహిమ అంటే.. దటీజ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు.. టీమ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు’అంటూ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో చేసిన పోస్ట్‌ వివాదానికి కారణమైంది.

Related Posts