YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు

కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు

కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు
కర్నూలు 
కర్నూలు జిల్లాలో హైకోర్టు బెంచ్ ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆదోనిలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.  31వ రోజు కు చేరిన న్యాయవాదుల నిరాహారదీక్షతో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వంపై ఓత్తిడి తెస్తున్నారు. కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ ఆదోనిలో భీమా సర్కిల్ సర్కిల్ దగ్గర గత 31 రోజుల గా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.ఈ దీక్షలో పాల్గోన్న న్యాయవాది విరుపాక్ష రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం టిడిపి గవర్నమెంట్ హయాంలో 60 రోజులు నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని అన్నారు.కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయ వాదులు డిమాండ్ చేస్తున్నా ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని,శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Related Posts