YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డిపోలముందు బీజేపీ ధర్నా

డిపోలముందు బీజేపీ ధర్నా

డిపోలముందు బీజేపీ ధర్నా
హైదరాబాద్ 
పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అన్ని అర్టీసీ డిపోల ముందు బీజేపీ శ్రేణులు నిరసన, ధర్నాలలో పాల్గొంటున్నారు. న్న ఆర్టీసీ ఉద్యోగస్తులు , కార్మికులకు అండగా నిలవాలనే పిలుపుమేరకు , మిథాని డిపోముందు ధర్నాకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వారికి మద్దతుగా సంఘీభావం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు వంగా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్ సుఖ్ నగర్ డిస్ట్రిక్ మరియు సిటీ డిపోల వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు , ఉద్యోగులతో కలసి దిల్ సుఖ్ నగర్,  మలక్ పేట్ డిపోల ముందు నిరసన ర్యాలీలు చేపడుతు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల కు అన్నిరకాలుగా అండగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని , వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిశీలించి అమలు చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.  ధనిక రాష్ట్రాన్ని కాస్త  దివాళా రాష్ట్రం గా మార్చారని , కార్పోరేట్ బడాబాబుల కు ఆర్టీసీ ఆస్తులను అంటగట్టాలని చూస్తున్నారని అయన ఆరోపించారు.  ఉద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి కాకముందు ఒకలా,   ముఖ్యమంత్రి అయ్యాక మరోలాగా ప్రతిరోజు వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యలపై ప్రధాని దృష్టి వరకు తీసుకెళ్తామని , విజయం మనదే అని ఆయన కార్మికులకు , ఉద్యోగస్తులకు హామీ ఇచ్చారు. 

Related Posts