YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చిరంజీవి దంపతులు 

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చిరంజీవి దంపతులు 

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన చిరంజీవి దంపతులు 
అమరావతి,  

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చేరుకున్న చిరంజీవి,  భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు.  ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి. అనంతరం ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు.  తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా జగన్ను చిరంజీవి కోరారు. ఇరువురు.విందు భోజనం ఆరగించారు. చిరంజీవితో బేటీ తరువాత సోషల్ మీడియా లో జగన్ ప్రకటన చేసారు.  'సైరా'తో చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పారు. 'చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను, నవ్వులను మాకు పంచుతూ ఉండాలి' అంటూ ఆకాంక్షించారు.

Related Posts