YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

పేదల కోసమే వైయస్సార్ కంటి వెలుగు

పేదల కోసమే వైయస్సార్ కంటి వెలుగు

 

పేదల కోసమే వైయస్సార్ కంటి వెలుగు

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు అక్టోబర్ 16, (న్యూస్ పల్స్):

సమాజంలోని పేదలు బడుగు బలహీన వర్గాల కోసమే వైయస్సార్ కంటి వెలుగు లక్ష్యమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు కోవూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం జరిగిన వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం స్కూల్లో జరగడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు విద్యార్థులకు దీనివల్ల చాలా లాభం కలుగుతుందని చెప్పారు కంటి పరీక్షలు చేయించు కోలేని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇది ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు నెలల్లోనే చేపట్టిన కార్యక్రమాల్లో ఇది చాలా ముఖ్యమైనదని పేర్కొ న్నారు కంటి చూపు మనిషికి చాల ప్రధానమైనద ని, దాని ప్రాధాన్యత అంతా ఇంతా కాదని తెలిపారు. ఈ పథకం ద్వారా కేవలం పరీక్షలు చేయడమే కాకుండా కంటి అద్దాలను కూడా అందజేస్తారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పేదలకు మరిన్ని పధకాలు కూడా చేపట్టారని, అవి అమలు అయితే అందరికీ మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కూడా మాట్లాడారు. కోటేశ్వర్ రెడ్డి అబూబకర్ ఇక్బాల్ నర సింహారావు ,సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు అంతకుముందు కోవూరు లోని వైసీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఎంపీ ప్రారంభించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో స్థానిక నాయకులు వైద్య ఆరోగ్య సిబ్బంది వైద్యులు పాల్గొన్నారు.

Related Posts