YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
గజ్వేల్ అక్టోబర్ 17 
సిద్దిపేట జిల్లా  గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో పత్తి, వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ ప్రాంభించారు.  తరువాత కల్యాణ లక్ష్మీ ,షాధి ముబారక్ చెక్కులను పంపిణీ చేసారు.  మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  116 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ. ఒక కోటి పదిహేను లక్షల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు.  850 పెండింగ్ చెక్కులను నాలుగైదు రోజుల్లో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.  రెండో పంట కోసం పల్లి, సెనగా విత్తనాలను 35 శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తున్నాం.  అన్ని చోట్లా యధావిధిగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తాం.  వడ్ల కొరకు 1835 రూపాయల మద్దతు ధర కల్పిస్తున్నామని అన్నారు.  అవసరమైతే మొక్కజొన్న కొనుగోళ్ళను కూడా చేస్తాం.  పత్తి మద్దతు ధర 5550 రూపాయలు ఇస్తాం రైతులు దీనిని వినియోగించుకోవాలి.   ఇది రైతు రాజ్యం రైతే ముఖ్యమంత్రి.  ఒక గజ్వెల్ నియోజకవర్గంలో 50 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్ లు ఉన్నాయి,గతంలో 3 వేల స్థాయి గౌడోన్ లు ఉండేవరి హరీష్ రావు అన్నారు.

Related Posts