YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉదారత చాటుకున్న విశాఖ ఎంపీ ఎంవీవీ మత్స్సకారునికుటుంబానికి రు.10 వేలు ఆర్ధిక సహాయం  ... ఆ మొత్తాన్ని వై ఎస్ ఆర్ సిపి  నాయకులకు అందజేత

ఉదారత చాటుకున్న విశాఖ ఎంపీ ఎంవీవీ మత్స్సకారునికుటుంబానికి రు.10 వేలు ఆర్ధిక సహాయం  ... ఆ మొత్తాన్ని వై ఎస్ ఆర్ సిపి  నాయకులకు అందజేత

ఉదారత చాటుకున్న విశాఖ ఎంపీ ఎంవీవీ
మత్స్సకారునికుటుంబానికి రు.10 వేలు ఆర్ధిక సహాయం  ...
ఆ మొత్తాన్ని వై ఎస్ ఆర్ సిపి  నాయకులకు అందజేత
విశాఖపట్నం 
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన ఉదారతను చాటుకున్నారు.సముద్రంలో వేటకువెళ్లి దురదృష్టవశాత్తు పిడుగుపాటుకు గురై గల్లంతైన  మత్స్య కారుడు  అరిశివిల్లి పాలరాజు కుటుంబానికి రు.10 వేలు ఆర్ధికసహాయం అందజేశారు. ఈ మొత్తాన్ని నగదు రూపం లో 17  వ వార్డు అధ్యక్షులు నీలారెడ్డి, విశాఖ నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి,తెడ్డు గురునాధరావు , పిళ్ళా దాశరాజు, వాసుపల్లి శ్రీనివాసరావు లకు అందజేశారు.ఆ మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయమని ఎంపీ చెప్పారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ఎంవీవీ గారు,తాజాగా  జీవీఎంసీ 17  వ వార్డు పెదజాలారిపేట  కు చెందిన కొందరు మత్స్యకారులు   నడి సంద్రంలో వారు పిడుగుపాటుకు గురైన విషయం తనకి తెలిసిందన్నారు. ఈ విషయం తెలిసిన తాను ఈ విధంగా తనకు తోచిన సహాయం చేయడం జరిగిందన్నారు.ఈ విషయాన్ని తమ అధినేత దృష్టికి తీసుకుని వెళ్లి తగు న్యాయం జరిగేట్టు కృషిచేస్తానన్నారు.

Related Posts