YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భర్తను ఐదు లక్షలకు అమ్మేసిన భార్య

భర్తను ఐదు లక్షలకు అమ్మేసిన భార్య

భర్తను ఐదు లక్షలకు అమ్మేసిన భార్య
బెంగళూర్, 
ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో జగపతిబాబు, ఆమని, రోజా జంటగా 15ఏళ్ల క్రితం వచ్చిన ‘శుభలగ్నం’ సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత త్వరగా మరిచిపోలేదు. అందులో డబ్బు పిచ్చి పట్టిన ఆమని తన భర్తను రోజాకు కోటి రూపాయలకు అమ్మేయడం అన్నది వింతగా ఉన్నా సినిమా మాత్రం బంపర్‌హిట్ అయింది. ఆ సినిమా చూసిన మహిళలు చాలామంది మా ఆయన్ని కూడా ఎవరైనా కొనుక్కుంటే బాగుండేది.. అంటూ సరదాగా సెటైర్లు కూడా వేసుకునేవారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో వెలుగుచూసింది. మాండ్య జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్తను రూ.5లక్షలకు మరో మహిళకు అమ్మేసిన ఘటన కలకలం రేపుతోంది.మాండ్య జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. అయితే ఆ భర్త సమీప గ్రామానికి చెందిన రమ్య అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కొన్నాళ్ల నుంచి సరిగా ఇంటికి రావడం లేదు. వచ్చినా ఒకట్రెండు రోజులు మాత్రమే భార్యతో గడిపి మళ్లీ ప్రియురాలి వద్దకు వెళ్లిపోతున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య చాలా పంచాయతీలు నడిచినా ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఇటీవల తన భర్త ప్రియురాలితో రాసలీలలు జరుపుతున్న సమయంలో భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీసింది.అయితే అతడిని వదిలేందుకు రమ్య అంగీకరించలేదు. ‘నీ భర్త నా దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించడం లేదు. దానికి ప్రతిఫలంగానే అతడు నాకు లైంగిక సుఖం అందిస్తున్నాడు. నీ భర్త కావాలంటే రూ.5లక్షలు చెల్లించి తీసుకెళ్లు’ అని రమ్య చెప్పింది. అయితే అంత డబ్బు తన దగ్గర లేదని, తన భర్తను శాశ్వతంగా వదిలేస్తే ఎంతిస్తావో చెప్పు అంటూ ఆ మహిళ చెప్పడంతో రమ్య షాకైంది. కొద్దిసేపు చర్చల తర్వాత రూ.5లక్షలకు బేరం కుదిరింది. నవంబర్ 17వ తేదీన డబ్బులు చెల్లిస్తానని, ఆ సమయంలో భర్త కట్టిన తాళిని తీసి తనకిచ్చేయాలని రమ్య ఆమెకు చెప్పగా అంగీకరించింది.

Related Posts