YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం

బంగ్లా టీమ్ తో భారత్ సిరీస్

బంగ్లా టీమ్ తో భారత్ సిరీస్

బంగ్లా టీమ్ తో భారత్ సిరీస్
ముంబై, 
దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌ ముగిసిన పది రోజుల్లోనే భారత్ గడ్డపై బంగ్లాదేశ్‌ని టీమిండియా ఢీకొట్టబోతోంది. రాంచీ వేదికగా శనివారం నుంచి సఫారీలతో ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు.. ఆ తర్వాత నవంబరు 3 నుంచి బంగ్లాదేశ్‌తో మూడు టీ20లు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ రూపొందగా.. తొలి టీ20 మ్యాచ్‌ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం (ఫిరోజ్ షా కోట్ల)లో జరగనుంది.నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభంకానున్నాయి. ఇక నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ రెండు టెస్టులూ ఉదయం 9.30 గంటల నుంచి మొదలవనున్నాయి.సిరీస్‌లో భాగంగా తొలుత జరిగే టీ20 సిరీస్‌ కోసం ఇప్పటికే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టుని ప్రకటించగా.. భారత సెలక్టర్లు ఈ నెల 24న టీమ్‌ని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సెలక్షన్‌కి కూడా తాను అందుబాటులో ఉండనని మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.బంగ్లాదేశ్ టీ20 జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయిం, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అపిఫ్ హుస్సేన్, మసదేక్ హుస్సేన్, అమినుల్ ఇస్లామ్, అర్ఫాట్ సన్నీ, మహ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్లా ఇస్లామ్

Related Posts