YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికుల బైక్ ర్యాలీ

తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికుల బైక్ ర్యాలీ

తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికుల బైక్ ర్యాలీ
సిద్దిపేట   
హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 14 వ రోజు కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా నేడు హుస్నాబాద్ బస్ డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రేపటి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ కార్మికులు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. విపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి బైక్ ర్యాలీలో పాల్గొన్నాయి. ప్రభుత్వ  వ్యతిరేక నినాదాలతో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ కార్మికులు కొద్దిసేపు ఆందోళన చేపట్టడంతో వాహనాలు కొద్ది దూరం వరకు అరగంట పాటు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తన మొండి వైఖరిని విడిచిపెట్టి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు.

Related Posts