YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

హాస్పిటల్లో ఉన్న బాధితులను  పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హాస్పిటల్లో ఉన్న బాధితులను  పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హాస్పిటల్లో ఉన్న బాధితులను  పరామర్శించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
హైదరాబాద్ 
ఎల్బీనగర్ చౌరస్తాలోని షైన్ పిల్లల వైద్యశాలలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఎమర్జెన్సీ వార్డులో భారీ అగ్నిప్రమాదం  జరిగింది ఘటనా స్థలాన్ని స్థానికి ఎమ్మెల్యే దేవిరెడ్డ సుధీర్ రెడ్డి పరిశీలించారు. తరువాత అక్కడివారితో మాట్లాడారు. 
హాస్పిటల్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్య కారణంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని అయన అన్నారు. నలభై మంది  రోగులను వివిధ హాస్పిట్లో పంపించారని, ఇంకా ఆరుగురు  పేషంట్లను   హాస్పిటల్లోనే వదిలి వెళ్లారని అన్నారు.  ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యంపై  కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అయన అన్నారు.
జీహెచ్ ఎంసీ  నిబంధనలు, మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయ క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అయన అన్నారు. చనిపోయిన వారికి ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బాధితులు అందరికీ మెరుగైన వైద్య సౌకర్యం అందేలా చర్యలు  తీసుకుంటామని తెలిపారు.

Related Posts