Highlights
- చట్టసభలు ప్రజాస్వామ్యానికి హేతువు కావాలి
- జేఏసీ చైర్మన్ కోదండరామ్
- కేసీఆర్ చర్య ప్రజాస్వామ్యానికి విఘాతం
రాష్ట్రలో ప్రజాస్వామ్యం దెబ్బతినలాగా చట్టసభలు వ్యవహరించకూడదని జేఏసీ చైర్మన్ కోదండరామ్
ప్రజాస్వామ్య బద్దంగా అసెంబ్లీ కార్యకలాలు కొనసాగించాల్సి ఉందన్నారు. గురువారం గాంధీభవన్ లో నిరసన దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి. వెంకటరెడ్డి, సంపత్ కుమారులకు అయన సాంగ్జిభావం తెలిపారు. ఎథిక్స్ కమిటీ సిపారసు లేకుండానే శాసనసభ్యులపైన వేటు వేయడాన్ని అయన ఆక్షేపించారు.సభ కూడా పరిశీలన చేసిన తరువాత చర్య తీసుకోవాలన్నారు.
అలాంటివేమీ జరగకుండా నియంతృత్వ ధోరణిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుపరచడం దుర్మార్గపు చర్య అన్నారు. ఇల్లాంటి విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా కమిటీ వేసి మెజారిటీ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారన్నా విషయాన్ని గుర్తు చేశారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో మాత్రం ఏకపక్షంగా కాంగ్రెస్ ను సస్పెండ్ చేశారన్నారు. మరి పార్లమెంట్ లో నిరసన తెల్పుతున టి ఆర్ ఎస్ ఎంపీ లను బహిష్కరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. సభ్యత్వ రద్దు పై ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పున:పరిశీలించాలన్నారు.