YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు
మంత్రాలయం 
మండల పరిధిలో ఇళ్ల స్థలాల ప్రక్రియ పూర్తిగా రద్దు చేస్తూ అర్హులైన నిరుపేదల అందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని మంత్రాలయం తాసిల్దార్ చంద్రశేఖర్ పేర్కొన్నారు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో మొదట వచ్చిన లిస్టు పూర్తిగా అవకతవకలు జరగినట్టు ఆరోపణలు వచ్చిన నేపత్యంలో  అర్హులకు కాకుండా అనర్హులకు  వచ్చాయని పిర్యాదులు అందడంతో మొదట వచ్చన జాబితా పూర్తిగా రద్దు చేస్తూ పారదర్శకంగా కొత్త జాబితా ను తయారు చేస్తున్నామన్నారు. మంగళవారం  తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలో జాబితాను ప్రకటించడం జరిగింది. ఇందులో దాదాపుగా అర్హులైన వారి పేర్లు లేవని అందువలన ఆ జాబితాను పూర్తిగా రద్దుచేస్తున్నామన్నారు. మరలా సర్వే చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టి.భీమయ్య,   పవన్ కుమార్, రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts