YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భారీ ఆఫర్లతో ఎయిర్ టెల్

భారీ ఆఫర్లతో ఎయిర్ టెల్

భారీ ఆఫర్లతో ఎయిర్ టెల్
హైద్రాబాద్, అక్టోబరు 23, 
ఒకప్పుడు తన కోట అయిన టెలికాం రంగంలో ఇప్పుడు జియో జెండా ఎగురుతుండటంతో ఎయిర్ టెల్ కూడా తిరిగి ఆ స్థానాన్ని తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. జియో మాదిరిగానే అధిక డేటాను అందిస్తూ, అదనపు ప్రయోజనాలను అందించే ప్లాన్లపై దృష్టి పెట్టింది. జియో వచ్చాక వినియోగదారుల రోజువారీ డేటా వినియోగం ఎక్కువ కావడంతో ఎయిర్ టెల్ ఇప్పుడు అధిక డేటాను అందించే అద్భుతమైన ప్లాన్ ను తీసుకువచ్చింది. అదే రూ.558 రీచార్జ్ ప్లాన్. మరి ఆ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే డేటా ఎంత వస్తుంది? కాల్స్ పరిస్థితి ఏంటి? అదనపు ప్రయోజనాలు ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం?రూ.558 విలువైన ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే.. రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. ప్లాన్ వ్యాలిడిటీ 82 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా మీకు రూ.558కే 246 జీబీ డేటా లభిస్తుందన్న మాట. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా మీరు ఈ రీచార్జ్ చేసుకున్నట్లయితే.. రోజుకు మరో 400 ఎంబీ అదనంగా డేటా లభిస్తుంది. అంటే 3 జీబీ బదులు రోజుకు 3.4 జీబీ డేటాని ఎయిర్ టెల్ అందిస్తుంది. గతంలో ఎయిర్ టెల్ ఇలాంటిదే రూ.549 ప్లాన్ ను అందించేది. ఈ రూ.558 ప్లాన్ అందుబాటులోకి వచ్చాక ఆ ప్లాన్ ను రద్దు చేసింది.ఈ ప్లాన్ ను జియో రూ.509 ప్లాన్ కు పోటీగా లాంచ్ చేశారు. జియో రూ.509 ప్లాన్ ద్వారా రోజుకు 4 జీబీ డేటాను, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను, జియో నెట్ వర్క్ నంబర్లకు అపరిమితమైన ఉచిత కాలింగ్ ను అందిస్తారు. అయితే ప్లాన్ వ్యాలిడిటీ మాత్రం కేవలం 28 రోజులు మాత్రమే. జియో కాకుండా ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేయాలంటే నిమిషానికి ఆరు పైసలు చార్జీ విధిస్తారు. అయితే ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ద్వారా అధిక వ్యాలిడిటీని అందించడమే కాకుండా, అన్ని నెట్ వర్క్ లకు ఉచిత కాలింగ్ అందించడం ద్వారా వినియోగదారులకు అధిక లాభాలు అందిస్తోంది.ఇక ఈ ప్లాన్ తో లభించే ఇతర లాభాల గురించి చెప్పాలంటే.. ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీమ్ ప్రీమియం మెంబర్ షిప్ తో పాటు, జీ5, హెచ్ఓఓక్యూ(HOOQ), 370కి పైగా టీవీ చానెళ్లు, 10 వేల వరకు సినిమాలకు యాక్సెస్ లభిస్తుంది. వీటితో పాటు వింక్ మ్యూజిక్ సపోర్ట్ లభిస్తుంది. సంవత్సరం పాటు మీ మొబైల్ ను వైరస్ ల నుంచి కాపాడటానికి నోర్టన్ మొబైల్ సెక్యూరిటీని కూడా ఎయిర్ టెల్ వారు ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా నాలుగు వారాల పాటు షా అకాడమీ ఉచిత కోర్సును అందిస్తారు. ఈ కోర్సు ద్వారా మీరు మ్యూజిక్ నుంచి ఫొటోగ్రఫీ దాకా ఏదైనా నేర్చుకోవచ్చు

Related Posts