YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మరాఠ ఫలితాల్లో కింగ్ మేకర్ గా శివసేన

మరాఠ ఫలితాల్లో కింగ్ మేకర్ గా శివసేన

మరాఠ ఫలితాల్లో కింగ్ మేకర్ గా శివసేన
ముంబై, 
అనుకున్న‌ట్లు బీజేపీ-శివ‌సేన కూట‌మి విక్ట‌రీ కొట్టింది. మ‌హారాష్ట్ర అసెంబ్లీ పోరులో బీజేపీ-శివ‌సేన జోడి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పినంత‌గా మాత్రం ఆ కూట‌మి త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయింది. 288 సీట్లు ఉన్న మ‌హారాష్ట్ర‌లో.. తాజా స‌మాచారం ప్ర‌కారం బీజేపీ-శివ‌సేన కూట‌మి 162 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న‌ది. కాంగ్రెస్‌, ఎన్సీపీ జోడి 97 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నాయి. మ‌హారాష్ట్ర‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. నిజానికి బీజేపీ-శివ‌సేన కూట‌మి మ్యాజిక్ మార్క్ దాటినా.. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్లుగా మాత్రం జ‌ర‌గ‌లేదు. బీజేపీ కూట‌మికి 211 సీట్లు వ‌స్తాయ‌ని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. కానీ ఫ‌లితాలు మాత్రం బీజేపీకి కొంత చేదు అనుభ‌వాన్ని మిగిల్చాయి. శివ‌సేన త‌న అన్ని స్థానాల‌ను దాదాపు గెలుచుకున్న‌ది. బీజేపీ మాత్ర‌మే త‌న స్వంత సీట్ల‌ను ఎక్కువ శాతం కోల్పోయింది. అయితే సీఎం ఎవ‌ర‌న్న దానిపై ఉత్కంఠ నెల‌కొన్న‌ది. శివ‌సేన త‌ర‌పున పోటీలో నిలిచిన ఆదిత్య థాక‌రే.. సీఎం అవుతారా లేదా అన్న ప్ర‌శ్న‌ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. సీఎం ఫ‌డ్న‌వీస్ త‌న ప‌ద‌విని నిలుపుకుంటారా లేక శివ‌సేన‌కు అర్పిస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉన్న‌ది.మహారాష్ట్రలో సంకీర్ణ రాజకీయం రసవత్తరమైన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ నేతృత్వంలోని బీజేపీ-శివసేన కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కును విజయవంతంగా దాటగలిగింది. కానీ, అనుకున్నట్టుగా బీజేపీ భారీగా స్థానాలు సాధించలేకపోయింది. కాషాయ పార్టీకి గతంలో కంటే సీట్లు తగ్గగా.. దాని మిత్రపక్షం శివసేన తన స్థానాలను మెరుగుపరుచుకొని.. రియల్‌ కింగ్‌మేకర్‌గా అవతరించింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా ఘోరంగా ఏమీ ఓడిపోలేదు. కాంగ్రెస్‌ మిత్రపక్షం ఎన్సీపీ గతంలో కంటే గణనీయంగా తన స్థానాలను పెంచుకుంది. ఫలితాల్లోని ఈ పరిణామాలు సహజంగానే అధికార బీజేపీపై హీట్‌ పెంచుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ కూటమితో శివసేన అధికారాన్ని పంచుకోవచ్చునని ఊహాగానాలు గుప్పుమన్నాయి. ఈ ఊహాగానాలను కొట్టిపారేసిన శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రావత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పిన ఆయన.. అందులో ఓ మెలిక పెట్టారు. గతంలో మాదిరిగా ఈసారి సీఎం పదవిని పూర్తిగా బీజేపీకి ఇచ్చేది లేదని సంకేతాలు ఇచ్చారు. సంకీర్ణ కూటమిలో భాగంగా అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామని, ఆ ప్రకారంగానే ప్రభుత్వం ఉండబోతున్నదని ఆయన కుండబద్దలు కొట్టారు. అటు థాక్రేల వారసుడు ఆదిత్యా థాక్రే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి.. వర్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపు దిశగా సాగుతున్నారు. మహారాష్ట్రలో థాక్రేల పాలన రావాల్సిందేనని శివసేన గట్టిగా పట్టుబడుతోంది. ఆదిత్య థాక్రేను సీఎంగా చూసుకోవాలని ఆ పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కూడా అందుకు సానుకూల సంకేతాలే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పదవిలో ఫడ్నవిస్‌ రానున్న ఐదేళ్లూ కొనసాగుతారా? లేక శివసేనతో ఆ పదవిని పంచుకుంటారా? ఆదిత్య థాక్రే సీఎం అవుతురా? అన్నది ఆసక్తి రేపుతోంది.

Related Posts