YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దెయ్యాన్ని చూపించండి... 50 వేలు తీసుకోండి

దెయ్యాన్ని చూపించండి... 50 వేలు తీసుకోండి

దెయ్యాన్ని చూపించండి... 50 వేలు తీసుకోండి
భువనేశ్వర్,
మీరు దెయ్యాన్ని చూశారా? ఒక వేళ చూసి ఉంటే ఆధారాలతో సహా చూపిస్తే రూ.50 వేలు నగదు బహుమతి గెలుచుకోవచ్చు. స్వయానా జిల్లా కలెక్టరే ఈ ప్రకటన చేశారు. దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించిన కలెక్టర్.. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధారాలతో సహా వచ్చేవారికి ఆ బహుమతి ఇస్తామన్నారు.ఒడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్ విజయ్ అమృత కులాంగే చేసిన ఈ ప్రకటన ఆ రాష్ట్రంలో చర్చనీయంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా దెయ్యాలు, భూతాలు ఉన్నాయని నిరూపిస్తే రూ.50 వేలు రివార్డు ఇస్తాను. స్వయంగా నా జేబు నుంచే ఆ డబ్బులు చెల్లిస్తా’’ అని తెలిపారు.‘‘చేతబడులు చేస్తున్నారని, మనుషులకు దెయ్యం పట్టిందనే వివిధ కారణాలతో ప్రజలు.. ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. వారిని దారుణంగా హింసిస్తున్నారు. ఇలాంటి మూఢ విశ్వాసాలను నమ్మవద్దని చెబుతున్నాను. ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేశాను’’ అని తెలిపారు. కలెక్టర్ చేసిన ప్రకటనపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలించాలని కోరుతున్నారు.

Related Posts