YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి

ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి

ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి
కోదాడ 
సూర్యాపేట జిల్లా కోదాడ లో టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం  జరిగింది. ఈ కార్యక్రమానికి కోదాడ శాసనసభ్యుడు   బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షత వహించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ హుజూర్ నగర్ ఉప ఎన్నిక ల లో కోదాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విస్తృతంగా సైదిరెడ్డి గెలుపుకు ప్రచారం చేసారని ప్రశంసించారు. పార్టీ గెలుపుకు సి ముఖ్య భూమిక పోషించారని అన్నారు.  ఉప ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు  వారికి ధన్యవాదాలు తెలిపేందుకు  శనివారం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కెసిఆర్  కృతజ్ఞత సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు కోదాడ నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు,  అభిమానులు కోదాడ నియోజకవర్గం లోని మాధవరం వద్ద సీఎం కేసీఆర్ కి ఘనంగా  స్వాగతం తెలిపేందుకు  ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల బాధ్యులు పాల్గొన్నారు. 

Related Posts