YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సరికొత్త ప్లాన్లను విడుదల చేసిన రిలయన్స్‌ జియో

సరికొత్త ప్లాన్లను విడుదల చేసిన రిలయన్స్‌ జియో

సరికొత్త ప్లాన్లను విడుదల చేసిన రిలయన్స్‌ జియో
హైదరాబాద్‌ 
రిలయన్స్‌ జియో తన జియోఫోన్‌ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్లను విడుదల చేసింది. ‘ఆల్‌ ఇన్‌ వన్‌’ పేరుతో ఈ ప్లాన్లను తెచ్చింది. ఇందులో భాగంగా రూ.75తో రీచార్జ్‌ చేసుకుంటే 3జీబీ డేటా, రూ.125తో 14జీబీ డేటా, రూ.155తో 28 జీబీ డేటా, 185తో 56 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ల కాలపరిమితి 28 రోజులు. కస్టమర్లు జియో నుంచి జియోకు ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చు. ఇతర ఆపరేటర్లకు ఫోన్‌ చేసేందుకు 500 నిమిషాలు కూడా లభిస్తాయని జియో తెలిపింది. ఇప్పటికే అమల్లో ఉన్న ప్లాన్లను కొనసాగించనున్నట్టు తెలిపింది. కాగా ఇటీవలే జియో స్మార్ట్‌ఫోన్ల కస్టమర్ల కోసం ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్లను విడుదల చేసింది. వీటిలో రూ.222, రూ.333, రూ.444, రూ.555 ప్లాన్లున్నాయి. వీటిద్వారా మరింత ఎక్కువ డేటాను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది.

Related Posts