YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆసమర్ధ ప్రభుత్వం ఇది

ఆసమర్ధ ప్రభుత్వం ఇది

ఆసమర్ధ ప్రభుత్వం ఇది
విజయవాడ 
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. భవనాలకు పార్టీ రంగులు వేసుకోవడానికి తప్ప... రాష్ట్రాన్ని పాలించడానికి వైసీపీ పనికిరాదని ఆయన విమర్శించారు. ఇంతటి అసమర్థ ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని  అన్నారు. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారు. భవన కార్మికులకు రూ. 150 కూలీ కూడా దొరకని పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆర్భాటం చేయడానికి తప్ప వైసీపీ పాలించడానికి పనికిరాదని కన్నా ట్వీట్టర్ లో వ్యాఖ్యానించారు.   తన వ్యాఖ్యాలతో పాటు  వివిధ కట్టడాలపై వైసీపీ రంగులు వేసిన ఫోటోలను షేర్ చేశారు. వీటిలో గ్రామ సచివాలయం, చేతి పంపు, శ్మశానం, ఓవర్ హెడ్ ట్యాంకుల ఫోటోలను కుడా అయన ట్వీట్ చేసారు.

Related Posts