YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

నగర అభివృద్ధి పైనే దృష్టి.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

నగర అభివృద్ధి పైనే దృష్టి.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

నగర అభివృద్ధి పైనే దృష్టి..
దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ.  అక్టోబర్ 30  (న్యూస్ పల్స్)
టిడిపి ప్రభుత్వం నగర అభివృద్ది పై పూర్తి గా నిర్లక్ష్యం వహించిందనీ, బాబు పాలనలో విజయవాడ నగర అభివృద్ది ఆకరి బాగాన నిలిచిందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. బుదవారం విజయవాడ భవాని పురం లో కోటి తొమ్మిది లక్షల రూపాయల వ్యయం తో 29 వ డివిజన్ లో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కురసాల కన్నబాబు, మరియు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భం గా మంత్రీ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వై యస్ అర్ సిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక నగర అభివృద్ధి పైన దృష్టి సారించిందన్నారు. అందులో బాగంగా దశల వారిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంబిత్సున్నామన్నారు, ఈ రోజు పశ్చిమ నియోజక వర్గం భవాని పురం 29 వ డివిజన్ నందు చర్చి రోడ్, సాయి దుర్గా నగర్ కాలని, తోట కనకమ్మ రోడ్ సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించామన్నారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. వరదల వల్ల ఇసుక కొరత వచ్చి భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష నేత ఆనంద పడుతున్నారన్నారు, ఐదు గంటల దొంగ దీక్షలకు లోకేష్ బాబు తెర తిసారాన్నరు ఎన్ని అపవాదలు వేసిన రాష్ట్ర ప్రజలు వై సి పి ప్రభుత్వం వెంటే ఉన్నారన్నారు
మంత్రి కూరసాల కన్నబాబు మాట్లాడుతూ.. గత టిడిపి ప్రభుత్వం లో విపరీతమైన అవినీతి కి పాల్పడిన వారు ఇవ్వాల మమ్మల్ని విమర్శించటం హాస్యాస్పదం గా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వై యస్ ఆర్ సిపి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సెంట్రల్ నియోజక వర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఇసుక కొరతను ప్రభుత్వ తప్పిదం గా ప్రజల్లో చూపించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు, టిడిపి హయాంలో విచ్చల విడిగా ఇసుక వ్యాపారం చేసింది ఎవరో బహిరంగ రహస్యమన్నారు ఇప్పటికైనా చంద్ర బాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితువు పలికారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, మాజీ కార్పొరేటర్లు బట్టిపాటి సంధ్యా రాణి, పుణ్య శిల, అప్పాజీ, పార్టీ నాయకులు మైలవరపు దుర్గా రావు, కృష్ణా రెడ్డి, జి యం సి బాషా, ఎస్ సి నాయకులు  కాలే పుల్లా రావు, మైనారిటీ నాయకులు రియాజ్, డివిజన్ అద్యక్షులు వెన్నం రజనీ, యరడ్ల ఆంజనేయ రెడ్డి, కూరాకుల నాగ, గురుమాంతు మహేష్, రబ్బానీ, పైడి పాటి మురళి తదితరులు పాల్గొన్నారు..

Related Posts