YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహారాష్ట్రలో  బీజేపీ-శివసేన కూటమి మధ్య వివాదం

మహారాష్ట్రలో  బీజేపీ-శివసేన కూటమి మధ్య వివాదం

మహారాష్ట్రలో  బీజేపీ-శివసేన కూటమి మధ్య వివాదం
ముంబై , అక్టోబర్ 30, 
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి మధ్య వివాదం తేగేదాకా లాగే పరిస్థితి కనబడుతోంది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వ్యాఖ్యలతో గరం గరంగా ఉన్న శివసేన తాజాగా తన అధికార పత్రికలో బీజేపీపై విమర్శలు గుప్పించింది. కశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకోనేందుకు 28 మంది ఎంపీల ఈయూ బృందం పర్యటనపై శివసేన మండిపడింది. ఈ మేరకు ‘సామ్నా’లో శివసేన ఓ కథనం ప్రచురించింది. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి అధ్యయనానికి 28 మందితో కూడిన ఐరోపా సమాఖ్య బృందం పర్యటిస్తోందని, కశ్మీర్‌ అంశం మన దేశ అంతర్గత వ్యవహారమైనప్పుడు ఇక్కడ వారికేం పని? అని ప్రశ్నించింది. ఇది భారత స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారంపై దండయాత్ర కాదా? నిలదీసింది.మన జాతీయ జెండా ఇప్పుడు కశ్మీర్‌లో ఎగురుతోందని, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షాల పట్ల గర్విస్తున్నామని పేర్కొంది. కశ్మీర్‌లో అన్నీ సక్రమంగా ఉంటే బయటి వ్యక్తులను అక్కడకు ఎందుకు పంపారని, కశ్మీర్‌ మన అంతర్గత వ్యవహారం కాదనా? మీ అభిప్రాయమా అని వ్యాఖ్యానించింది. మీ ప్రభుత్వ నిర్ణయాల్లో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోకూడదు.. కానీ, ఇలా బయటి వ్యక్తులు మాత్రం కశ్మీర్‌లో సంచరించవచ్చా? అని శివసేన ప్రశ్నించింది. విదేశీయులు ఇలా అక్కడ పర్యటిస్తే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని, కశ్మీరీల స్వేచ్ఛకు అది భంగం కలిగించినట్లు కాదా? మండిపడ్డారు.ఏ ఉద్దేశం లేకుండానే ఈయూ ప్రతినిధులు కశ్మీర్‌లో పర్యటిస్తున్నారా..? ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పి తీరాలి’ అని డిమాండ్ చేసింది. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మాట్లాడితేనే విమర్శించారని, మరి ఈయూ ఎంపీల పర్యటనను ఎందుకు అక్కడ అనుమతించారని ప్రశ్నించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరాటంగా చెప్పుకున్న ప్రధాని మోదీ విజయవంతమయ్యారని, విదేశీ ఎంపీలను ఎలా అనుమతిస్తారని ఎద్దేవా చేసింది. అంతేకాదు, ఐరోసా సమాఖ్య ఎంపీలు కశ్మీర్‌కు వచ్చిన పర్యాటకులుగా మాదిరిగా సందర్శించిన నిశ్శబ్దంగా వెళ్లిపోవాలని, ఇబ్బందిని సృష్టించవద్దని పేర్కొంది.

Related Posts