YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏపీ టూ హైద్రాబాద్... ఆదాని డేటా సెంటర్ తరలింపు

ఏపీ టూ హైద్రాబాద్... ఆదాని డేటా సెంటర్ తరలింపు

ఏపీ టూ హైద్రాబాద్...
ఆదాని డేటా సెంటర్ తరలింపు
హైద్రాబాద్, అక్టోబర్ 30, (న్యూస్ పల్స్)
గుజరాత్‌కు చెందిన అదానీ గ్రూప్ హైదరాబాద్‌లో 13 బిలియన్ డాలర్ల వ్యయంతో డేటా సెంటర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయనుంది. అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్‌ కోసం శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన డిజిటల్ రియాల్టీతో జత కడుతున్నట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, డిజిటల్ రియాల్టీ మధ్య ఎంఓయూ కుదిరింది. ఈ రెండు సంస్థలూ కలిసి దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల‌ను అభివృద్ధి చేసి, నిర్వహిస్తాయి. వాస్తవానికి డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ గతంలో ప్రకటించింది.హయాంలో 2019 జనవరిలో విశాఖపట్నంలో రూ.70 వేల కోట్లతో డేటా, సోలార్ పార్కుల ఏర్పాటుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అదానీ గ్రూప్‌ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. రాబోయే 20 ఏళ్లలో లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. తొలి విడతగా 500 ఎకరాల విస్తీర్ణంలో ఒక గిగా వాట్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని.. తర్వాత ఐదు గిగా వాట్స్‌ సోలార్‌ పార్క్‌ను కూడా నెలకొల్పాలని భావించారు. ఈ డేటా కేంద్రాన్ని ఇంటర్నెట్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌తో అనుసంధానించడం ద్వారా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించే కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తుందని అప్పట్లో చంద్రబాబు సర్కారు ప్రకటించింది. బాబు హయాంలో విశాఖలో ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్‌నే అదానీ గ్రూప్ హైదరాబాద్ తరలిస్తోందని తెలుస్తోంది. ఈ విషయమై టీడీపీ శ్రేణులు జగన్ సర్కారుపై మండి పడుతున్నాయి. ఈ డేటా సెంటర్‌ను తరలించడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన రూ.70 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు రాకుండా పోయాయని ఆరోపిస్తున్నారు. భారీ ఆదాయం, ఉపాధి అవకాశాలను ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Related Posts