YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొల్లాపూర్ కాంగ్రెస్ నేతల  భేటీ

కొల్లాపూర్ కాంగ్రెస్ నేతల  భేటీ

కొల్లాపూర్ కాంగ్రెస్ నేతల  భేటీ
నాగర్ కర్నూలు, 
నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొల్లాపూర్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు  నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ తో సమావేశం అయ్యారు.  ఈనెల నాలుగవ తేదీన జరగబోయే పాదయాత్రపై చర్చించారు. జిల్ధార్ తిప్ప మినీ ఎత్తిపోతల పథకం కొరకు జిల్ధార్ తిప్ప నుండి కొల్లాపూర్  అఫిస్ వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో ముక్కిడిగుండం, మొలచించపల్లి రైతుల్ని,  మిత్ర పక్షాలను కలుపుకొని పాదయాత్ర  కొనసాగుతుంది. పాదయాత్ర రైతులతో కలసి నడవడానికి నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ ను ఆహ్వానించారు. . పాదయాత్ర లో భాగంగా కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర జరిగే బహిరంగ సభలో ముఖ్య అతిధులుగా మాజీ ఎంపీ  మల్లు రవి,  మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి,బొల్లు కిషన్, ఇతర నేతలు పాల్గొంటారు.  త్వరలో జరగబోయే కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కుడా  జిల్లా నాయకులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి, గాలి యాదవ్, రాము యాదవ్,  ముస్తఫా, పరుశురాం, రఫీ,మాజీ సర్పంచ్ ఎత్తం కృష్ణయ్య,క్రాంతి, గోపాల్, శీలం వెంకటేష్, కిరణ్ కుమార్,బాలస్వామి, అరవింద్ తదితరులు పాల్గోన్నారు.

Related Posts