YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

ఘనంగా ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

ఘనంగా ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
 అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను సాధింద్దాం : ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు  నవంబర్ 1 
 అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను సాధించాలని ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. పట్టణంలోని స్థానిక మునిసిపల్ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.వేడుకకు ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి,ఆర్డీఓ బాలగణేశయ్య లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పొట్టి శ్రీరాములును స్మరించుకుంటూ అమర్ హై అంటూ నినాదాలు చేసారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమిళనాడు నుంచి తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలని 53 రోజుల పాటు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు.దాని ఫలితంగా 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు.కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జి.రఘునాథ్ రెడ్డ్,డిఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మేనేజర్ యూనుస్,మెప్మా అధికారి మోహన్,పట్టణ అధ్యక్షుడు బుట్టారంగయ్య,ధర్మకారి నాగేశ్వరరావు,రియాజ్,సచివాలయ అధికారులు,వార్డు వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు..

Related Posts