YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 కేసీఆర్ బేషజాలు వీడాలి

 కేసీఆర్ బేషజాలు వీడాలి

 కేసీఆర్ బేషజాలు వీడాలి
గజ్వెల్  నవంబర్ 02
సిద్దిపేట జిల్లా గజ్వెల్  ప్రజ్ఞాపూర్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ప్రపంచం ఉన్నన్ని రోజులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరపడం సాధ్యం కాదని చెప్పిన కేసీఆర్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్టీసీ విలీనం చెంపపెట్టని ఆయన తెలిపారు. అవహేళనగా మాట్లాడిన కేసీఆర్ తీరుని సవాల్ గా తీసుకొని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఆర్టీసీ విలీనం త్వరగా చేస్తామని చెప్పిన మాటకైనా కేసీఆర్ తీరు మారాలని ఆయన పేర్కొన్నారు.దిన దిన గండంగా బ్రతుకుతున్న ఆర్టీసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ బేష జలాలు విడనాడి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం తో పాటుగా 26 డిమాండ్ల పై తక్షణమే ప్రభుత్వం చర్చలు జరపాలి ఆయన ప్రభుత్వానికి ఆయన సూచించారు.

Related Posts