YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త నెల్లూరు

భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త నెల్లూరు

భార్యను కిరాతకంగా హతమార్చిన భర్త
నెల్లూరు నవంబర్ 02,(న్యూస్ పల్స్):
జీవితాంతం తోడునీడగా ఉంటానని అగ్నిసాక్షిగా పెళ్లాడిన వ్యక్తి భార్యను అత్యంత కిరాతకంగా చంపి కర్కశంగా మారాడు.ఈ హత్యా సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు చుండుగుంటకాలనీలో చోటు చేసుకుంది.నెల్లూరు రాంనగర్‌కు చెందిన గిద్దలూరు తులసి కి, కోవూరు చుండుగుంట కాలనీకి చెందిన విజయ్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. విజయ్‌ నెల్లూరులో ఆర్డీసీలో డ్రైవర్‌గా విధులు నిర్వహించేవాడు. తులసి ఇంటి వద్ద ఉంటోంది.ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతుల మధ్య అనుమానం చిచ్చురేపింది. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని తులసి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నెల్లూరు మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్త విజయ్‌తోపాటు అత్త, తన ఐదేళ్లకుమార్తెతో కలిసి రాత్రి నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున భార్యను మొద్దుకత్తితో అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.మొత్తం 16 కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్య చేసిన అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడిని తమకు అప్పగించాలని మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Related Posts