YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య

అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్య

రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ క్రమంలో తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దుండగుడు ఈ ఘటనకు పాల్పడిన అనంతరం తనపై కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ సిబ్బందిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Related Posts