YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ పై మండిపడ్డ అవంతి

పవన్ పై మండిపడ్డ అవంతి

పవన్ పై మండిపడ్డ అవంతి
విశాఖపట్నం
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న చీకటి ఒప్పందంతోనే ప్రజలను జనసేనను తిరష్కరించారని మంత్రి అవంతి శ్రీనివాస్ రావు విమర్శించారు.  చంద్రబాబు వయస్సు మీరిపోవడంతో పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు టిడిపి నేతలైన అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడుతో కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వాళ్ళు లేకుండా విశాఖలో పవన్‌ సభ పెట్టలేరా అని విమర్శించారు. విజయసాయి రెడ్డిని విమర్శించడానికి పవన్‌కు ఏం అర్హత ఉందన్నారు. విజయసాయి రెడ్డిలా రాజ్యసభలో  ఎవరూ మాట్లాడలేరని, పవన్‌ సినిమాల్లో సంపాదించిన సొమ్మును భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలని సూచించారు. పవన్‌ లాగా అసభ్యంగా ఎవ్వరూ మాట్లాడరని అవంతి విమర్శించారు.  జగన్‌పై పెట్టినవి తప్పుడు కేసులని ప్రజలే తీర్పునిచ్చారన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు కేసులు పెట్టడం సాధారణమని అవంతి శ్రీనివాస్‌ అన్నారు. 

Related Posts