YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

 ప్రజా సమస్యలకు మద్దతు ఉంటుంది : చంద్రబాబు

 ప్రజా సమస్యలకు మద్దతు ఉంటుంది : చంద్రబాబు

 ప్రజా సమస్యలకు మద్దతు ఉంటుంది : చంద్రబాబు
విజయవాడ, నవంబర్ 4,
విశాఖలో జనసేన పార్టీ లాంగ్ మార్చ్‌కు మద్దతు ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రిక్వెస్ట్ చేశారని.. అందుకే లాంగ్‌ మార్చ్‌కు మద్దతు తెలిపామన్నారు. ఏ పార్టీ ప్రజా సమస్యలపై స్పందించినా టీడీపీ వారికి మద్దతు ఇస్తుందన్నారు. సోమవారం విజయవాడలో జరిగిన తెలుగు దేశం పార్టీ విస్తృతిస్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. ఈ వ్యాఖ్యలు చేశారు.ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు తీసుకుంటున్నారని.. భవన నిర్మాణ కార్మికులకు నెలకు పదివేలు నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గతంలో ఉప్పు సత్యాగ్రహం చేశారని.. ఇప్పుడు ఇసుక సత్యాగ్రహం చేయాల్సి వస్తోందన్నారు చంద్రబాబు. ఉచిత ఇసుక తెచ్చిన టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కతుందని.. ఊరికొక వైసీపీ ఇసుకాసురుడు తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ఏపీ నుంచి పక్కరాష్ట్రాలకు ఇసుక తరలిపోతోందని.. వేలకు వేలు రేట్లకు అమ్ముకుంటున్నారని.. వరద వచ్చిన రాష్ట్రాలన్నిటిలో ఇసుక దొరుకుతోందన్నారు.ఐదారు నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందన్నారు చంద్రబాబు. టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని.. హత్యా, రౌడీ రాజకీయాలు మానుకోవాలని వైసీపీని హెచ్చరించారు. ఇటు ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదు చేయడంతో పార్టీ సమావేశాలకు కూడా రావడం లేదని వ్యాఖ్యానించారు. కోడెలపై ఫర్నీచర్ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేయకపోవడంతో వారు రోడ్డున పడ్డారన్నారు.వైఎస్సార్‌సీపీ సర్కార్ దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని కేడర్‌కు పిలుపిచ్చారు.

Related Posts