YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

అతి తక్కువ ధరకు జియో  సేవలు,.

Highlights

  • ఇషా ఆలోచనలకు రూపమే జియో
  •  జీవితాంతం అత్యంత నాణ్యమైన డేటా సేవలే లక్ష్యం
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ
అతి తక్కువ ధరకు జియో  సేవలు,.


అతి తక్కువ ధరకే దేశంలోని అందరికీ అత్యంత నాణ్యమైన వాయిస్ కాల్స్‌తోపాటు డేటాను జీవితాంతం అందించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నట్టు  రిలయన్స్ జియో‌కు సంబంధించి ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు.ఫైనాన్షియల్ టైమ్స్-ఆర్సెలార్ మిట్టల్ బోల్డ్‌ెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్’ కార్యక్రమంలో ‘డ్రైవర్స్ ఆఫ్ చేంజ్’ అవార్డు అందుకున్న అంబానీ మాట్లాడుతూ. రెండేళ్ల క్రితం డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలో 155వ స్థానంలో ఉంటే జియో రాకతో ప్రస్తుతం నంబర్ వన్ స్థానానికి చేరుకున్నట్టు అంబానీ వివరించారు..
. ప్రస్తుతం ఎల్‌టీఈ లో  4జీని కలిగి ఉన్న అతిపెద్ద డేటా నెట్‌వర్క్  రిలయన్స్ జియో ఇప్పుడు 5జీ సేవలకు కూడా సిద్ధమవుతున్నట్టు అంబానీ ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి భారత్ 4జీ సేవల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఇంతటి విజయానికి వెనుక మా అమ్మాయి ఆలోచనలున్నాయని అంబానీ చెప్పారు. ఓసారి అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో చదువుతున్న మా అమ్మాయి ఇషా తన ప్రాజెక్టు వర్క్‌ విషయంలో నెట్ చాలా స్లోగా ఉందన్న విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇషా సోదరుడు ఆకాశ్ వెంటనే స్పందిస్తూ అప్పట్లో వాయిస్ కాల్స్ ద్వారా టెలికం కంపెనీలకు డబ్బులొచ్చేవి. ఇప్పుడంతా డిజిటల్. ఇక భవిష్యత్తు అంతా బ్రాండ్‌బ్యాండ్‌దే అన్నాడు. ఈ టెక్నాలజీని భారత్ మిస్ కాకూడదని నాతో అన్నారు. వారి మాటలతో నాకూ ఓ ఆలోచన తట్టింది. జియో స్థాపనకు అలా నాందిపడింది’’ అని ముకేశ్ వివరించారు.

Related Posts