YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్ విదేశీయం

మలేషియా వాసి భౌతిక కాయం రేపు హైదరాబాద్ కి ....

మలేషియా వాసి భౌతిక కాయం రేపు హైదరాబాద్ కి ....

మలేషియా వాసి భౌతిక కాయం రేపు హైదరాబాద్ కి ....
విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారి వినతికి స్పందించిన కేంద్ర మంత్రి 
తొలుత అక్కడే ఖననం చేద్దామని అనుకున్న కంపెనీ యాజమాన్యాలు 
కుదరదని పట్టుబట్టిన విశాఖ ఎంపీ .....
న్యూఢిల్లీ ,  
దురదృష్టవశాత్తూ   మలేషియాలో విశాఖ గాజువాక ప్రాంత కుంచమాంబ కాలనీ వాసుడు నక్కా అప్పలరాజు మరణించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ అప్పలరాజు  పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ఆయన భౌతిక కాయాన్ని అక్కడే ఖననం  చేయడానికి సిద్ధపడింది.ఈ నేపథ్యంలో స్పందించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అలాకుదరదని పట్టుబట్టి గతనెల 31  న కేంద్ర విదేశీవ్యవహారాల శాఖా మంత్రి  సుభ్రహ్మణ్యంజై శంకర్ కి  అత్యవసర లేఖ ను రాశారు. ఈ విషయం పై స్పందించిన కేంద్రమంత్రి,  ఇండియన్  ఎంబసీ తో మాట్లాడారు. స్పందించిన ఆ ప్రభుత్వం ఆ భౌతిక కాయాన్ని అక్కడనుంచి పంపిస్తున్నట్టు ప్రకటించింది.ఈ భౌతిక కాయం రేపు కౌలాలంపూర్ నుంచి రాత్రి 11 .30 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది.అక్కడనుంచి  బంధువులు విశాఖకు తరలించనున్నారు.ఎంపీ  చొరవతో ఈ పని పూర్తికావడంపట్ల అప్పలరాజు కుటుంబ సభ్యులు ఎంపీ కి కృతజ్ఞతలు తెలిపారు

Related Posts