YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించిన మేయర్ రామ్మోహన్

రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించిన మేయర్ రామ్మోహన్

రోబోటిక్ యంత్రాన్ని ప్రారంభించిన మేయర్ రామ్మోహన్
హైదరాబాద్  
మ్యాన్ హోల్స్ లోని చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రాన్ని హైటెక్ సిటీ లో న మేయర్ బొంతు రామ్మోహన్ మంగళవారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్  హరి చందన హజరయ్యారు.  బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ లో మొట్ట మొదటిసారిగా హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని తీసుకొచ్చాం. గతంలో మ్యాన్ హోల్స్ లో చెత్త తీసేపనుల్లో దురదృష్టవశాత్తు పలువురు కార్మికులు మరణించారు. సరి కొత్త టెక్నాలజీ తో రోబోటిక్ యంత్రం ద్వారా పూడిక తీత పనులు చేస్తున్నాం. దీని ద్వారా 24 గంటలు పని చేయొచ్చని అన్నారు. రోబోటిక్ యంత్రానికి నాలుగు కెమెరాలతో పాటు   రోబోటిక్ లెగ్స్, ఆర్మ్స్, యూజర్ ఇంటర్ ఫేస్ డిస్ప్లేకు అనుసంధానంగా ఉంటాయి. ఈ రోబో యంత్రాలకు రహేజా సంస్థ సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో మరిన్ని రోబోటిక్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని అయన అన్నారు.

Related Posts