YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన రెవెన్యూ శాఖ అధికారులు

నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన రెవెన్యూ శాఖ అధికారులు

నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన రెవెన్యూ శాఖ అధికారులు
తుగ్గలి 
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో గల అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయా రెడ్డి పై జరిగిన సంఘటనపై తుగ్గలి మరియు మద్దికేర రెవెన్యూ సిబ్బంది తహసిల్దార్ కార్యాలయం  ముందు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ఎమ్మార్వో పై జరిగిన సంఘటన చాలా ఘోరం అని తెలియజేశారు. రైతులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు.మండల స్థాయి అధికారుల వలన సమస్యలు పరిష్కారం కాకుంటే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని వారు తెలియజేశారు.రైతులకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారం కాకుంటే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని,ఎటువంటి చర్యలకు పాటు పడకూడదని వారు తెలియజేశారు.ఎమ్మార్వో మృతి పట్ల రెవెన్యూ అధికారులు సంతాపాన్ని తెలియజేశారు. మున్ముందు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని వారు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తుగ్గలి మండలం డిప్యూటీ తాహసిల్దార్ నిజాముద్దీన్,తుగ్గలి మండల విఆర్వోలు,విఆర్ఏలు,తుగ్గలి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది మరియు మద్దికేర తహసిల్దార్ శివ శంకర్ నాయక్,మద్దికెర మండల విఆర్వోలు,వీఆర్ఏలు మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.

Related Posts