YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ

ముగిసిన మహా మృత్యుంజయ పాశుపత హోమం...

ముగిసిన మహా మృత్యుంజయ పాశుపత హోమం...

ముగిసిన మహా మృత్యుంజయ పాశుపత హోమం... 
జోగులాంబ గద్వాల  
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో  మంగళవారం ప్రారంభమైన మహామృత్యుంజయ పాశుపత హోమం బుధవారం పూర్ణాహుతితో ముగిసింది ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  సతీమణి బండ్ల జ్యోతి హాజరై హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే కల్యాణ మండపంలో జరిగిన శ్రీనివాసుని కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం అభిషేకములు గోపూజ శివాలయంలో లక్షబిల్వార్చన అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆదోని మండలం పురందర దాసు భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో హరినామ సంకీర్తనలు ఆలపించారు ఈ కార్యక్రమంలో అర్చకులు మధుసూధనాచారి చింతరేవుల అర్చకులు భీమ్సేన్ ఆచారి రమేష్ ఆచారి సురేంద్ర దాస్ రవి ఆధ్వర్యంలో కల్యాణోత్సవం జరిపించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు సాయంత్రం జరిగిన కోటి దీపోత్సవం లో అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు

Related Posts