YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

వీడని మహాముడి

వీడని మహాముడి

వీడని మహాముడి
ముంబై, 
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకున్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. చెరిసగం పాలన, సీఎం పదవి కోసం శివసేన పట్టువీడట్లేదు. దీంతో ప్రభుత్వంలో చేరేలా శివసేనను ఒప్పించేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భేటీ అయ్యారు. అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ.. శివసేనతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామనే ప్రశ్నే లేదన్నారు. బీజేపీ-శివసేన గత 25 ఏళ్లుగా కలిసి ఉన్నాయని, మరోసారి వారే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని పవార్ అన్నారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.సంజయ్ రౌత్‌తో భేటీలో రాజకీయ పరిణామాలు తమ మధ్య చర్చకు రాలేదని, తమ సమావేశానికి ఎలాంటి ప్రత్యేకత లేదని అన్నారు. మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభాన్ని తాము కోరుకోవడం లేదని పవర్ పేర్కొన్నారు. బీజేపీ-శివసేన పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయాలని సూచించారు. శివసేనకు మద్దతు ఇస్తున్న 170 మంది ఎమ్మెల్యేల జాబితాను సంజయ్ రౌత్ తనకు చూపించారని పవార్ అంగీకరించారు. అయితే, ఈ జాబితాను ఆయన ఎలా సంపాదించారో తనకు తెలియదని పవార్ అన్నారు.అంతేకాదు, త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల గురించి తాము చర్చించామని పవార్ వివరించారు. అంతేకాదు, మహారాష్ట్ర విషయంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న విషయం తనకు తెలియదని అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను మూడుసార్లు పనిచేశానని, మళ్లీ తనకు అంతగా ఆసక్తి లేదని అన్నారు. బీజేపీ-శివసేనకు అనుకూలంగా ప్రజలు తీర్పునిచ్చారు కాబట్టి, వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఆయన పేర్కొన్నారు.అంతకు ముందు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. రాష్ట్రంతోపాటు దేశంలోనే అత్యంత సీనియర్ నేత శరద్ పవార్.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకున్న రాజకీయ పరిస్థితులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిపై పవార్‌తో చర్చించానని అన్నారు. మరోవైపు, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ భేటీ అయ్యారు. సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కూడా రంగంలోకి దిగుతున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చలు జరిపేందుకు ఆయన ముంబయి చేరుకున్నారు.
షా...ఏం చేస్తారో చూస్తాం : పవార్
 మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ ఏర్పాటులో ఆల‌స్యం జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. బీజేపీ చీఫ్‌కు మరాఠ నేత శరద్ పవార్ ఓ స‌వాల్ విసిరారు. మ‌హారాష్ట్ర‌లో అమిత్ షా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ప‌వార్ అన్నారు. శివ‌సేన‌తో తాము పొత్తు పెట్టుకోబోమ‌ని స్ప‌ష్టం చేశారు. బీజేపీకి ఎటువంటి సంఖ్యా బ‌లం లేని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డంలో అమిత్ షాకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ద‌ని, మ‌హారాష్ట్ర‌లో అమిత్ షా త‌న రాజ‌కీయ స‌త్తాను ప్ర‌ద‌ర్శించాల‌ని ప‌వార్ స‌వాల్ విసిరారు. అసెంబ్లీ ఫ‌లితాలు వెలుబ‌డి రెండు వారాలు గ‌డుస్తున్నా.. ఇంకా అక్క‌డ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌లేదు. బీజేపీ-శివ‌సేన కూట‌మే ఎన్నిక‌ల్లో పైచేయి సాధించింది. కానీ అధికారం పంప‌కం విష‌యంలో ఆ రెండు పార్టీల మ‌ధ్య విబేధాలు వ‌చ్చాయి. దీంతో ప్ర‌భుత్వ ఏర్పాటు ఆల‌స్యం అవుతోంది. ఇప్ప‌టికే శివ‌సేన‌కు చెందిన సంజ‌య్ రౌత్‌.. రెండుసార్లు ప‌వార్‌ను క‌లిశారు. కానీ మ‌హా ప్ర‌తిష్టంభ‌న తొల‌గ‌డం లేదు. 175 మంది ఎమ్మెల్యేల స‌పోర్ట్ ఉంద‌ని రౌత్ పేర్కొన్నా.. దాంట్లో క్లారిటీ లేద‌ని ప‌వార్ అన్నారు. మేం కేవ‌లం ప్ర‌తిప‌క్షంలోనే కూర్చుంటామ‌ని ప‌వార్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

Related Posts